గాసిప్స్ – NTR 30 కోసం జాన్వీ షాకింగ్ పారితోషకం.?

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న లేటెస్ట్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా దీనితో ఎట్టి పరిస్థితుల్లో మాసివ్ హిట్ కొట్టాలని దర్శకుడు కొరటాల శివ అయితే గట్టి ప్లానింగ్స్ తో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు.

ఇక నిన్ననే అయితే సినిమా యూనిట్ హీరోయిన్ ఎవరు అనే అవైటింగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ అందించారు. అనుకుంటున్నట్టుగానే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని డిజైన్ చేసి జాన్వీ కపూర్ పేరుని అనౌన్స్ చేసారు. అయితే ఈమెపై మరింత గ్రాండ్ గా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాలతో ఆ అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు జాన్వీ మొదటి టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రికార్డు మొత్తంలో ఛార్జ్ చేస్తుంది అని కొన్ని షాకింగ్ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సినీ వర్గాలు మరియు సోషల్ మీడియా బజ్ ప్రకారం ఈ సినిమాకి జాన్వీ కపూర్ ఏకంగా 15 కోట్లు పారితోషకం తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే ఇది నమ్మశక్యంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే జాన్వీ కి హిందిలో అంత పెద్ద స్టార్డం కూడా ఏమి లేదు. దీనితో తెలుగులో ఇంత మొత్తం తీసుకునే ఛాన్స్ లేదనే చెప్పాలి. ఒకవేళ నిజంగా తీసుకుంటే అది మాత్రం పెద్ద రికార్డే అని చెప్పుకోవాలి.