ఫ్రీ పబ్లిసిటీ “బ్రో”..సినిమాలో కూడా జనసేనే..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా మేకర్స్ కూడా ఈ సినిమాపై అవైటెడ్ టీజర్ పై బిగ్ అప్డేట్ ని అందించగా ఈ టీజర్ ని అయితే రేపే జూన్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే ఇది బాగానే ఉంది కానీ ఈ టీజర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఓ సాలిడ్ పోస్టర్ ని ఇద్దరు హీరోస్ పై డిజైన్ చేయగా పవన్ ఫ్యాన్స్ ఓ ఇంట్రెస్టింగ్ అంశం పట్టుకున్నారు. ఈ పోస్టర్ లో పవన్, సాయి ధరమ్ తేజ్ పవన్ వింటేజ్ గెటప్స్ లోనే కనిపిస్తుండగా వారి చేతికి సరిగ్గా చూస్తే ఓ బ్యాడ్జ్ లాంటిది కనిపిస్తుంది.

దానిని ఇంకొంచెం బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ జనసేన లోగో కనిపిస్తుంది. దీనితో పవన్ తన పార్టీ కి ఈ రకంగా ఫ్రీ పబ్లిసిటీ తన సినిమా ద్వారా చేసేసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇది పవన్ ఫ్యాన్స్ కి బాగానే ఉన్నా పవన్ పై అయితే లేని పోనీ కామెంట్స్ ని మాత్రం తప్పకుండా తీసుకొస్తుంది అని చెప్పాలి.

ఇప్పటివరకు లేని పబ్లిసిటీ పిచ్చి పవన్ కి కూడా అంటుకుంది అనుకుంటారు. కాగా ఈ చిత్రానికి అయితే సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.