ఇన్సైడ్ టాక్ : “స్కంద” సీక్వెల్ ఆగిపోయిందా?

రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఎన్నో అంచనాలు పెట్టుకొని విడుదల చేసిన సినిమా “స్కంద” కూడా ఒకటి. కాగా దర్శకుడు బోయపాటి శ్రీను మరియు హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో అయితే వచ్చిన ఈ చిత్రం ఫలితం మాత్రం అనుకున్న రేంజ్ లో అందుకోలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం అనుకున్న రేంజ్ లో రావడం లేదు.

దీనితో స్కంద చిత్రానికి చాలా చోట్ల నష్టాలే మిగిలాయి. అయితే ఈ నెగిటివ్ అంతటినీ థమన్ మీదకి నెట్టేసే ప్రయత్నం అయితే బోయపాటి చేసాడు. కానీ ఫైనల్ గా మాత్రం అంతా బోయపాటినే బ్లేమ్ చేయగా ఈ సినిమాకి అయితే చిత్ర యూనిట్ లాస్ట్ లో చూపించినట్టుగా సీక్వెల్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

కానీ ఫైనల్ గా చిత్రానికి మాత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం అందరిలో సీక్వెల్ కోసం అంత డిమాండ్ కూడా పెద్దగా లేకపోవడంతో ఐతే ఇప్పుడు ఈ సీక్వెల్ నిలిచిపోయినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇదే కాకుండా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు కి కూడా సీక్వెల్ నిలిచిపోయింది అని అదైతే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో ఆపేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ సీక్వెల్స్ ఆగిపోయినట్టే అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో అయితే శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా నటించారు.