పవర్ స్టార్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ..?

జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా పరుత్తి వీరన్ సినిమాలోలో నేచురల్ పర్ఫార్మెన్స్ కి ప్రియమణి నేషనల్ అవార్డు దక్కించుకుంది. రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో నటించిన ప్రియమణి నితిన్, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి సక్సస్ లను సొంతం చేసుకుంది.

Pawan Kalyan at his farmhouse | Top & Hot Gallery

అయితే పెళ్ళి చేసుకున్న ప్రియమణి కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు తెలుగులో వరసగా సినిమాలు ఒప్పుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న రెండు సినిమాలు అద్భుతమైన సినిమాలని చెప్పాలి. కాగా ఈ రెండు సినిమాలకి సురేష్ బాబు నిర్మాత కావడం విశేషం.

తమిళ అసురన్ రీమేక్ నారప్ప లో వెంకటేష్ సరసన నటిస్తున్న ప్రియమణి.. రానా సరసన కూడా నటిస్తుంది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విరాటపర్వం అన్న టైటిల్ తో తెరకెక్కుతుంది. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

పవన్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్ కూడా రీమేకే? | Ayyappanum Koshiyum Remake  Announced jsp

కాగా తాజా సమాచారం ప్రకారం ప్రియమణి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందట. రీసెంట్ గా మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ లో నటించబోతున్నట్టు ప్రకటించాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్, సర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి హీరోయిన్స్ విషయంలో రక రకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాలో పవన్ కి జోడీగా సాయి పల్లవి నటిచబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రియమణి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటన్నది మేకర్స్ వెల్లడిస్తేగాని క్లారిటీ రాదు.