పవర్ స్టార్ కి జంటగా ఇస్మార్ట్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ …?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం రీమేక్ లో పవర్ స్టార్ నటించబోతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు జరుగుతున్నాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.

Tollywood: Pawan Kalyan wants to remake this Malayalam film in Telugu

ఇక ఈ సినిమాలో పవర్‌స్టార్ బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనుండగా మరో పాత్ర పృథ్వి రాజ్ పాత్ర ఎంపిక జరగాల్సి ఉంది. అయితే ఈ పాత్ర కోసం ప్రముఖంగా రానా దగ్గుబాటి పేరు వినిపిస్తోంది. త్వరలో ఈ పాత్ర కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందని సమాచారం. అయితే కొంచం గ్యాప్ దొరికినా క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేసేలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని సమాచారం.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 15 రోజుల పాటు ఒక షెడ్యూల్ జరిగింది. కాగా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మొదలవ్వాల్సి ఉండగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్ కమిటవడం తో క్రిష్ సినిమా డిలే అవుతోంది. అయితే డిసెంబర్ నుంచి క్రిష్ కూడా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ ని తీసుకోవాలని క్రిష్ ఆలోచిస్తున్నాడట. ఇదే గనక నిజమైతే నిధి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.