పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళిపోయాడు.. ఇక రాడు అనుకున్న వాళ్ళకి టన్నులకొద్ది సర్‌ప్రైజెస్ ఇచ్చాడు. రీ ఎంట్రీ ఇస్తూ వరసగా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే నాలుగు సినిమాలు కమిటై వాటిలో ఒక సినిమా దాదాపు కంప్లీట్ చేశాడు. ఇంతలోనే డై హార్ట్ ఫ్యాన్ బండ్ల గణేష్ తో మరో సినిమా ని ఇటీవల అనౌన్స్ చేశాడు. కనీసం 3 సినిమాలు 2021 లో రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.

PSPK 27: Director Krish Jagarlamudi Released the Pre-look Poster of Pawan  Kalyan - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్న పవర్ స్టార్ 2021 సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

ఇక ఇక ఇప్పటికే మొదలైన క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళనుందట. నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అంతేకాదు క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయకపోవడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలలో ఈ సినిమా గురించి వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఈ పాన్ ఇండియన్ సినిమాలో క్రిష్ మరింత గ్రాండ్ నెస్ తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను ఎంచుకుంటున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్ కి షాకిచ్చాడు. వాస్తవంగా ఈ సినిమా అప్డేట్స్ 2021 జనవరి వరకు రావని అందరు ఫిక్స్ అయ్యారు. కారణం క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేయడానికి ఒక సినిమా కమిటయ్యాడు. కాని పవర్ స్టార్ సినిమాకి సంబంధించిన పనులన్ని మరో వైపు కానిచ్చేస్తున్నాడట క్రిష్. సో ఖచ్చితంగా ఈ సినిమా 2021 లో రిలీజ్ గ్యారెంటీ.