మైక్ టైసన్ భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బయట పెట్టిన పూరీ జగన్నాథ్…!

పూరి జగన్నాథ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. ఆగష్టు 25 వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల అయ్యింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల పూరి జగన్నాథ్ ని దర్శకుడు సుకుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ ఈ సినిమా విశేషాల గురించి సుకుమార్ తో పంచుకున్నాడు. లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించటం వల్ల మైక్ టైసన్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ సినిమాలో పెట్టాలని మొదట నిర్ణయించుకున్నట్లు పూరి వెల్లడించాడు. కానీ మైక్ టైసన్ లాంటి వ్యక్తి ఎందుకు ఆయన బ్రతికే ఉన్నాడు కదా మైక్ టైసన్ ని పెడితే ఎలా ఉంటుందని బాగా ఆలోచించిన తర్వాతే ఆయనని అప్రోచ్ అయ్యామని పూరి వెల్లడించాడు. ఈ సినిమా కోసం మైక్ టైసన్ ని ఒప్పించటానికి చార్మి ఒక సంవత్సరం పాటు కష్టపడిందని ఈ సందర్భంగా పూరి తెలియజేశాడు.

ఆ తర్వాత అమెరికాలో సెట్ వేసి ఆయన కోసం ఎదురు చూస్తుంటే మైక్ రాగానే ఇదంతా కలా నిజమా అనిపించింది. ఆయన వచ్చి షూటింగ్ లో పాల్గొన్న కూడా మాకు నమ్మటానికి చాలా సమయం పట్టింది అంటూ పూరి వెల్లడించాడు. సినిమా షూటింగ్ సమయంలో మైక్ టైసన్ భార్య ఒక సందర్భంలో చార్మితో మాట్లాడుతూ.. నా భర్త యాక్టర్ కాదు ఫైటర్ అని చెప్పిందట. ఈ విషయాన్నీ కూడా పూరి ఈ ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. ఇక మరోక సందర్భంలో మైక్ టైసన్ ని ఇండియాకి తీసుకువస్తారా? అని సుకుమార్ అడగ్గా..ప్రస్తుతం సినిమా రిలీజ్ పనులలో బిజిగా ఉన్నాము. ఇప్పుడూ ఆయనని ఇండియాకి తీసుకురావటం చాలా కష్టం అంటూ పూరి బదులిచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.