ఇన్సైడ్ టాక్ : సాయి ధరమ్ తేజ్ కోసం “వీరమల్లు” ని దింపుతున్నారు.!

ప్రస్తుతం టాలీవుడ్ లో సిద్ధం అవుతున్న ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా మరియు పలు ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ లు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో లేటెస్ట్ గా మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్న సినిమా కూడా ఒకటి. అయితే వినోదయ సీతం తో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ కూడా వేరే వేరేగా పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు.

కాగా వాటిలో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా “విరూపాక్ష” అయితే పవన్ నుంచి తాను నటిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. ఈ రెండు సినిమాలతో మామ అల్లుడు లు పాన్ ఇండియా లెవెల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే సాయి తేజ్ విరూపాక్ష కోసం మేకర్స్ భారీ ప్లానింగ్స్ లు చేస్తుండగా..

ఆల్రెడీ సినిమా గ్లింప్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని దింపారు. ఇక నెక్స్ట్ అయితే సినిమా టీజర్ కోసం చిత్ర యూనిట్ ఇప్పుడు పవర్ స్టార్ ని దింపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఈ మార్చ్ 1న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా నిన్న తెలిపారు.

కాగా ఈ టీజర్ ని అయితే పవన్ చేతులు మీదగా మేకర్స్ రిలీజ్ చేయించనున్నారట. ఇక దీనిపై అఫీషియల్ అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాని యంగ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు అయినటువంటి కార్తీక్ దండు వర్క్ చేస్తుండగా భీమ్లా నాయక్ లేటెస్ట్ గా సార్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది.