Pawan Kalyan: పవన్ ను ఒకసారి చూడాలనుకున్నా… కానీ కుదరలేదు: డైరెక్టర్ సాగర్ కే చంద్ర

Pawan Kalyan: భీమ్లా నాయక్ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుకుంది.మరే ఏ హీరోకు లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం.భీమ్లా నాయక్ కోసం ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. అయితే ఫిబ్రవరి 25 న సినిమా రిలీజ్ కు సిద్ధమైయింది చిత్ర యూనిట్. ఇక ఫిబ్రవరి 23 రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు KTR హాజరయ్యారు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ సాగర్ కే చంద్ర మాట్లాడుతూ 2011 లో జరిగిన ఒక సంఘటనను చెప్పారు. అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో కళ్యాణ్ గారి సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలనుకున్న అందుకోసం ఎంట్రీ పాస్ కూడా ఉంది. కానీ మూడు సార్లు తోసేసారు కలవలేక పోయాను. కానీ ఇపుడు కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయడం మరచిపోలేని క్షణం అని ఎమోషనల్ అయ్యారు.

ఇక రానా దగ్గుబాటి, నిత్యమేనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఫస్ట్ టైం నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ కు నన్ను తీసుకున్నందుకు సూర్య దేవర నాగ వంశీ గారికి ధన్యవాదములు తెలిపారు. చినబాబు గారికి అలాగే ఈ ప్రాజెక్ట్ కు మాటలు, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్ కు డైరెక్టర్ సాగర్ కే చంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.