ఉడకబెట్టిన గుడ్లు ఇలా ఉండటం నా జీవితంలో చూడలేదు… వైరల్ అవుతున్న రవీంద్ర పోస్ట్..?

ప్రముఖ తమిళ జంట మహాలక్ష్మి రవీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు ఆట నటిగా గుర్తింపు పొందిన మహాలక్ష్మి నిర్మాత అయిన రవీంద్ర చంద్రశేఖర్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. రవీంద్ర చంద్రశేఖర్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వగా మహాలక్ష్మి కూడా మొదటి భర్తకు దూరమై విడాకులు తీసుకున్న తర్వాత రవీంద్ర ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇలా లేటు వయసులో ఇద్దరు రెండవ వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి తమిళ ఇండస్ట్రీలోనే మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

వివాహం తర్వాత వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫోటోలు, హనీమూన్ ఫోటోలు ఇలా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా ఈ ట్రోలింగ్స్ గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాకుండా వీరికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోలర్స్ కి గట్టిగా సమాధానాలు చెబుతున్నారు. ఇటీవల దీపావళి పండుగ సెలబ్రేషన్ కి సంబంధించిన వీరి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవల రవీంద్ర చంద్రశేఖర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తన భార్య మహాలక్ష్మి వంట నైపుణ్యాన్ని తెలిపే ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా ఉడకబెట్టిన గుడ్డు పగలడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటూ నల్లగా మాడిపోయిన కోడిగుడ్ల ఫోటోని షేర్ చేస్తూ చాలా చమత్కారంగా కామెంట్ చేశాడు. ఇక నేను సన్నబడడం తప్ప మరొక మార్గం లేదు మహాలక్ష్మి అంటూ రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేస్తుంటే.. మరి కొంత మంది ఎప్పటిలాగే వీరి గురించి నెగిటివ్ గా కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.