సాయి పల్లవి, నాగ చైతన్య సినిమాకి నార్మల్ బడ్జెటే అంతట.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర అనౌన్స్ అయ్యిన క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి అలాగే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య మరియు హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ కూడా ఒకటి. మరి నిన్ననే అఫీషియల్ గా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి మేకర్స్ వెల్కమ్ చెప్పగా..

ఆమె కూడా ఎంతో ఆనందంగా ఈ సినిమాలో వర్క్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ సినిమాని చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ముందే టాక్ వచ్చింది. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కాబట్టి చాలా పర్టిక్యులర్ గా అంతా ఉంటుంది.

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఈ సినిమాకి జస్ట్ నార్మల్ గా అనుకున్న బడ్జెట్ నే సుమారు 80 కోట్లుగా ఉందట. ఇది అంతా షూట్ స్టార్ట్ కాకముందే ఒక అంచనాగా మేకర్స్ వేసుకున్న బడ్జెట్. దేనికి ఎంతెంత అవుతుంది అని ఓ లెక్క వేస్తే 80 కోట్లు ఇప్పటికి వచ్చింది అట.

ఇక సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఈ లెక్క డెఫినెట్ గా మరింత పెరుగుతుంది అని రూమర్స్ ఉన్నాయి. దీనితో నాగ చైతన్య కెరీర్ లోనే మొదటి హైయెస్ట్ బడ్జెట్ తో ఓ సాలిడ్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో అంత విశేషం ఏముందో అల్లు అరవింద్ ఎందుకు అంత నమ్మారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి.