అనుపమ కల ఇలా  నెరవేరిందట!

Anupama Parameshwaran

‘శతమానం భవతి’ నాయిక అనుపమ పరమేశ్వరన్‌కు తెర వెనక దర్శకత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎప్పటి నుంచో ఉందట. అందుకే తాను కథానాయికగా నటిస్తున్న ‘మణియారాయిలే అశోకన్‌’ అనే మలయాళ చిత్రానికి సహాయ దర్శకురాలిగా అవతారమెత్తింది.

నటనలో ఎంతగా జీవిస్తుందో.. అదే స్థాయిలో సహ దర్శకురాలిగా పనిచేస్తోంది… “స్వతహాగా నాకు దర్శకత్వంపై ఇష్టం ఉంది. కానీ హీరోయిన్‌గా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అందుకే ఈ సినిమాకు వచ్చిన అవకాశాన్నిఇలా వినియోగించుకుంటున్నా. నా దృష్టిలో స్క్రీన్‌పై కనిపించే అద్భుత దృశ్యం తాలూకు మ్యాజిక్‌ అంతా తెర వెనకే సృష్టించబడుతుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నా. ఎంతో ఇష్టపడి పనిచేశాను కాబట్టి.. సెట్‌లో ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. నా తొలిచిత్రం ‘ప్రేమమ్‌’ నుంచి దర్శకత్వ విభాగంలో పనిచేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో అవకాశమొస్తే సినిమాకు దర్శకత్వం చేస్తా’ అని ఎంతో ధీమాతో చెప్పింది అనుపమ పరమేశ్వరన్‌.

తాజాగా  అనుపమ పరమేశ్వర్ యువ హీరో నిఖిల్ తో త్వరలో జతకట్టనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, దర్శకుడు సుకుమార్ తాజగా ’18 పేజెస్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.