రహస్యంగా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ పూర్ణ.. కారణమేంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూర్ణ ఆ తర్వాత సీమటపాకాయ్, అవును, అవును 2, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా వంటి మంచి హిట్ సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం పూర్ణ సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా గుండె తెరమీద ప్రసారమాతరం టీవీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్‌ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారని.. వీరు విడిపోవడానికి టాలీవుడ్ హీరో కారణం అంటూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన పూర్ణ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ ఈ వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో పూర్ణ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని ఆమె అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది అంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ క్రమంలో పెళ్లి గురించి పూర్ణ మాట్లాడుతూ.. మే 31వ తేదీన ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత జూన్ 12వ తేదీన దుబాయ్ వేదికగా మేమిద్దరం వివాహ బంధంలోకి అడుగు పెట్టాము అంటూ చెప్పుకొచ్చింది. అయితే వీసా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. తొందర్లోనే కేరళలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రస్తుతం పూర్ణ తన భర్తతో కలిసి దుబాయ్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.