హీరోయిన్ కళ్యాణి.. భర్తతో విడిపోవడానికి కారణం ఇదేనా?

రాజశేఖర్ శేషు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కళ్యాణి. ఈ అమ్మడు మొదటి చిత్రంతో హిట్ అందుకొని తరువాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. మలయాళీలో చైల్డ్ యాక్టర్ గా కళ్యాణి కెరియర్ ప్రారంభించారు. అయితే హీరోయిన్ గా మాత్రం డెబ్యూ తెలుగులోనే కావడం విశేషం.

సౌందర్య తర్వాత ఆ స్థాయిలో నటిగా మన్ననలు అందుకున్నారు. తరువాత దర్శకుడు సూర్య కిరణ్ కి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు కానీ కొన్నేళ్లకి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఇద్దరు ఎప్పుడూ కూడా మీడియా ముందు దానికి సంబందించిన కారణాలు చెప్పలేదు.

కళ్యాణి అయితే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు దర్శకురాలిగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇదిలా నటి సుజిత సూర్య కిరణ్ కి సొంతం చెల్లి అనే సంగతి అందరికి తెలిసిందే. కళ్యాణితో ఆమెకి మంచి అనుబంధం ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారిద్దరూ విడిపోవడానికి గల కారణాలని సుజిత పంచుకున్నారు.

పెళ్లి తర్వాత సూర్య కిరణ్ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. వాటి కారణంగా ఇద్దరూ కూడా విడిపోయారు. అంతకు మించి వారి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవు. కేవలం ఆర్ధిక ఇబ్బందులే వారి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు.

తరువాత ఎవరి ప్రయాణాలు వారు కొనసాగిస్తునాన్నారని సుజిత్ చెప్పుకొచ్చారు. మొత్తానికి కళ్యాణ్, సూర్య కిరణ్ విడాకులు తీసుకున్న విషయం సుజిత ద్వారా అందరికి తెలిసింది. విడాకుల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చాలా సినిమాలు చేశారు. చివరిగా యాత్ర మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం దర్శకురాలిగా నిలబడటానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.