క్రేజీ థ్రిల్లర్ పై “హనుమాన్” దర్శకుడు రివ్యూ.!

ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో పలు చిత్రాలు గట్టి విజయాలు సాధిస్తున్నాయి. చిన్న స్పాన్ తో వచ్చినా కూడా భారీ సక్సెస్ ని అందుకొని కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. పలు చిత్రాలు భారీ బడ్జెట్ లు తారాగణం ఉన్నప్పటికీ అందుకొని ఫీట్ లు ఈ ఏడాదిలో టాలీవుడ్ చిన్న చిత్రాలు టచ్ చేసి చూపించాయి.

అలా గత కొన్ని నెలలుగా రైటర్ పద్మభూషణ్, బలగం, మేమ్ ఫేమస్ లేటెస్ట్ గా బేబి, సామజవరమనా లాంటి చిత్రాలు దుమ్ము లేపాయి. ఇక దీనితో పాటుగా వీటి ఫార్మాట్ లోనే రాబోతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “హిడింబ”. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రంలో అశ్విన్ బాబు హీరోగా నటించాడు.

అయ్యితే ట్రైలర్ తర్వాత నుంచి మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం నిన్ననే సాలిడ్ ప్రీమియర్స్ కూడా వేసుకుంది. దీనితో వాటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ ప్రీమియర్ లో భారీ చిత్రం “హనుమాన్” ని తెరకెక్కిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన రివ్యూ ఐతే ఇప్పుడు సినీ వాగుల్లో వైరల్ గా మారింది.

తనకి ఈ ఏక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చింది. అని మెయిన్ గా సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ లు అవన్నీ మైండ్ బ్లాక్ చేశాయని చెప్పుకొచ్చాడు. జెనరల్ గా ప్రశాంత్ వర్మ చిత్రాల్లో అదిరే ట్విస్టులు ఇస్తాడు అలాంటి తనకే ఈ సినిమాలో ట్విస్టులు బాగా అనిపించాయి అని చాలా ఎగ్జైటెడ్ గా చెప్పాడు.

దీనితో హిడింబ బాగానే ఉంది అని అనుకోవాలి. అంతే కాకుండా ఈ మధ్య థ్రిల్లర్ జానర్ లో వచ్చిన విరూపాక్ష చిత్రంతో కూడా దీనిని పోల్చి దీనిని కూడా ట్రై చేయమని చెప్తున్నాడు. దీనితో ప్రశాంత్ వర్మ రెస్పాన్స్ కి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు థాంక్స్ చెప్తున్నారు.