మొదటిసారి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ.. మంత్రిపై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి?

కాస్టింగ్ కౌచ్ వివాదం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర లేపుతూ ఇండస్ట్రీలో ఆర్ధనగ్న ప్రదర్శన చేసిన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష నాయకుల శ్రీరెడ్డి అప్పటినుండి పాపులర్ అయి మీటూ ఉద్యమానికి తెరలేపింది. ఇలా అప్పటినుండి సినీ ప్రముఖుల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచు వివాదాల్లో నిలుస్తూ ఉండే శ్రీ రెడ్డి.. ఏపీ రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద కూడా తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా పవన్ కల్యాణ్ ఏపీ మంత్రులను ఉద్దేశించి చెప్పుతో కొడతాను అని దూషిస్తూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శ్రీరెడ్డీ రంగంలోకి దిగి, పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అవుతూ.. పచ్చి బూతులు తిడుతూ యూట్యూబ్ లో వీడియో వదిలింది. ఈ వీడియో లో పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపించి వార్నింగ్ ఇస్తు.. ఇది ప్రజాస్వామ్యమా? ఇంకేమైనానా? మంత్రుల్ని కొట్టి.. చెప్పులు చూపించి రౌడీయిజం చూపిస్తారు. మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటూ రెచ్చిపోయింది.

అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిడితే రెచ్చిపోయే శ్రీ రెడ్డి ఇటీవల అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా నిప్పులు చెరిగింది. అనిల్ యాదవ్ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన భార్యా పిల్లలను కూడా దూషించాడు. దీంతో శ్రీరెడ్డి కల్పించుకొని …నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఆడాళ్లు, పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా కొడకా అంటూ రెచ్చిపోయింది. వైసీపీలోని అనిల్ అనే దరిద్రుడు వైసీపీ పార్టీ పేరు చెప్పుకుని బెదిరింపులకు పాల్పపడుతున్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకుంది పవన్.. దమ్ముంటే ఆయన్ను తిట్టు. పెళ్లాం పిల్లల జోలికి వస్తే నరుకుతా.జగన్ అన్న ఇలాంటివి ఎంకరేజ్ చేయడు అంటూ అనిల్ యాదవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.