పవన్ అభిమాన నిర్మాతకి ఆర్ధిక కష్టాలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన నిర్మాతలలో ముందు వినిపించే పేరు ఏఎం రత్నం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖుషి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఖుషి సినిమాతో ఏఎం రత్నం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు.తరువాత పవన్ తోనే అన్నవరం మూవీ చేశారు. ఈ సినిమా ఎవరేజ్ అయ్యింది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాని పాన్ ఇండియా లెవల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ళ క్రితం మొదలైన ఈ మూవీకి చాలా అడ్డంకులు వచ్చాయి. అయితే ఈ ఏడాదిలో పవర్ స్టార్ మూవీ పూర్తి చేస్తాడని అనుకున్నారు. కాని మరో 35 నుంచి 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.

ఇది ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయ పర్యటనలు, మరో వైపు సుజిత్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ చేయడంపైన ఫోకస్ పెట్టారు. అస్సలు హరిహర వీరమల్లు సినిమా గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడినట్లే కనిపిస్తోంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ కావడంతో దానికోసం కాస్తా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పరిస్థితిలో లేరు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో హాట్ న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం చాలా ఆర్ధిక కష్టాల్లో ఉన్నారని, ఈ కారణంగానే హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్. సినిమాకి మరో 25 కోట్ల వరకు పెట్టుబడి అవసరం ఉందని, దానిని అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో నిర్మాత ఉన్నారని ప్రచారం నడుస్తోంది.

రీసెంట్ గా ఏఎం రత్నం పాత సినిమాని రీరిలీజ్ చేయడానికి కొంతమంది అతన్ని అప్రోచ్ అయ్యారంట. దానికోసం కేవలం 50 లక్షలు ఏఎం రత్నం డిమాండ్ చేశారంట. కనీసమా అడ్వాన్స్ గా 10 లక్షలు అయిన ఇవ్వాలని రిక్వస్ట్ చేసారంట. కాని అవతలివైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని వినికిడి. మరి ఏఎం రత్నం ఆర్ధిక కష్టాలపై జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఆయన చెబితే కాని తెలియదు.