కృష్ణ చనిపోయిన తర్వాత కూడా నేనే మేకప్ వేసా.. పర్సనల్ మేకప్ మెన్ ఎమోషనల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. నవంబర్ 14వ తేదీ గుండెపోటుతో హాస్పిటల్లో చేరినటువంటి ఈయన 15వ తేదీ మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో ఆఖరి శ్వాస వదిలారు.ఈ విధంగా కృష్ణ గారు మరణించడంతో ఎంతో మంది అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.ఇక కృష్ణ గారు మరణించడంతో ఎంతో మంది సెలెబ్రెటీలు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. కృష్ణ గారు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఆయన తనని తన దగ్గర పనిచేసే వ్యక్తిగా కాకుండా సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేసేవారని ఆయన మంచితనం గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు.

ఇక కృష్ణ గారి ప్రతి సినిమాలకు తానే మేకప్ వేసానని చివరిసారిగా శ్రీశ్రీ అనే సినిమాకు మేకప్ వేశానని తెలిపారు. అయితే ఈయన చనిపోయిన తర్వాత కూడా తానే మేకప్ వేశాను అని తెలిపారు.కృష్ణ గారు మరణించిన తర్వాత అలా అచేతనంగా పడి ఉండటం చూసి చాలా బాధ కలిగింది. అయితే అక్కడ ఏం చేయాలో ఎవరికీ తెలియకపోవడంతో తానే తన మొహాన్ని శుభ్రంగా కడిగి ముక్కులో దూది పెట్టానని,కాళ్లు చేతులకు కూడా తానే ముడి వేశానంటూ ఈ సందర్భంగా కృష్ణ గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన అంత్యక్రియల సమయంలో కూడా తానే స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి నుదుటిన కుంకుమ పెట్టి తనకు మేకప్ వేశానని మాధవరావు కృష్ణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.