పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓజీ మూవీపై ఫ్యాన్స్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో థియేటర్లకు రానుందని గాసిప్స్ వచ్చాయి గానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే అది నిజమయ్యేలా కనిపించటం లేదు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఫ్యాన్స్కి కలవరాన్ని కలిగిస్తున్నాయి.
‘గ్రౌండ్ జీరో’ విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ ఓజీ షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్తో ఇప్పటి వరకు ఒక్కసీన్ కూడా తీయలేదని స్పష్టం చేశారు. తన సీన్స్ పూర్తిగా టచ్ కాలేదని, త్వరలోనే పిలవొచ్చన్నరు. ఆయన మాటల్లో కనిపించిన స్పష్టతే… చిత్రంలో ఇంకా ఎక్కువ భాగం షూట్ కావలసి ఉందన్న సంకేతాల్ని ఇస్తోంది. ఈ వార్త విని ఫ్యాన్స్ కొంత నిరాశ చెందడం సహజమే.
ఒకవేళ ఇమ్రాన్ పాత్ర చిన్నదైతే పెద్దగా షూట్స్ అవసరం ఉండకపోవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, అది పవన్కి దీటైన పాత్రగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇప్పటి వరకు కాంబినేషన్ సీన్లు లేకపోవడం చిత్ర కథనంలో ప్రాధాన్యతగల భాగాలే మిగిలి ఉన్నాయన్న సంకేతం. ఆ సన్నివేశాలు పూర్తయిన తరువాతే మూవీని పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి ప్రమోషన్లకు రావాలి.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నా… పవన్ రాజకీయ ప్రాధాన్యతల వల్ల షూటింగ్లో అంతరాయాలు వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. అందువల్లే 2025లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆత్మీయంగా సమయాన్ని వెచ్చిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఓజీ ఎప్పటికి థియేటర్లలోకి వస్తుందో.