దిల్ సినిమా హీరోయిన్ భర్త ఎవరో తెలిస్తే అవుతారు!

నేహా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఆమె దిల్ సినిమాలో హీరోయిన్ గా అయితే ఆమెను బాగా గుర్తుపడతారు. ఆమె మాయకా..సాత్ జిందగీ భర్కాలో మహి మల్హోత్రా పాత్రతో ఇంకా కైసా యే ప్యార్ హై లో కృపా శర్మగా బుల్లితెరపై సీరియల్స్ లో ప్రముఖ పాత్రలు పోషించింది.

అంతే కాకుండా ఈ అందమైన నటి దిల్, అతడే ఒక సైన్యం, అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇందులో దిల్ సినిమా బాగా ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తరువాత ఆమె చేసిన అతడే ఒక సైన్యం ఆమెను నిరాశపరిచింది. అయిన ఆమె దోస్త్, బొమ్మరిల్లు, ఇంకా దుబాయ్ శీను వంటి చిత్రాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించడం జరిగింది.
అయిన ఆమెకు అంతగా గుర్తింపు అయితే దక్కలేదు.

అయితే నేహా మహారాష్ట్రలోని ముంబైలో రామ్‌నిరంజన్ ఆనందిలాల్ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో రెండవ సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. అలాగే నేహా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమె నటనలో డిప్లొమా చదివారు.

నేహా వాస్తవాల గురించి అయితే ఆమె మహారాష్ట్రలోని ముంబైలోని మార్వాడీ కుటుంబంలో పెరిగారు. గతంలో ఆమె ఇండియా ఫోరమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేహా తన ఇంటిపేరు “బాంబ్” అని పాఠశాలలో తనను ఆటపట్టించారని, “బాంబ్” అని పిలిచారని పేర్కొంది.
నేహా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హిందీ టెలివిజన్ సీరియల్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు తాను చాలాసార్లు మూర్ఛపోయానని చెప్పడం జరిగింది.

అయితే, సౌత్‌లో షూటింగ్ జరుగుతున్న విధానం ఆమెకు చాలా బాగా నచ్చిందట. ఎందుకంటే ఆమె సాయంత్రం 6 గంటలకే తిరిగి బయలుదేరుతున్నదున బాగా నచ్చేది అని చెప్పుకొచ్చింది. 2005లో బాలాజీ టెలిఫిల్మ్స్ షో అయిన కైసా యే ప్యార్ హై అనే సీరియల్ తో సంతకం చేసింది.
నేహా కేవలం 2 పంజాబీ చిత్రాలలో ఇష్క్ హో గయా మేను ఇంకా పంజాబీ కుడి లో మాత్రమే నటించడం జరిగింది. ఆమె నటించిన 8 సినిమాలలో మిగిలినవన్నీ తెలుగు భాషలో ఉన్నాయి.

ఇంకా నేహా తన తల్లిదండ్రులతో చాలా సన్నిహితంగా ఉంటుంది. పార్టీలకు వెళ్లడం అంటే ఆమెకు చాలా ఇష్టం.
ఆమె కాలేజీలో ఉన్నప్పుడు మోడలింగ్‌లో కూడా దూసుకుపోయింది.

నేహా తన క్లాస్ మేట్ అయిన రిషిరాజ్ ఝవేరితో కలిసి కొన్ని రోజుల పాటు డేటింగ్ కూడా చేసింది. ఆ తరువాత రిషిరాజ్ ఝవేరి ఇంకా నేహా డిసెంబర్ 2007న ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. అయితే ఆమె దక్షిణాదికి వెళ్లే వరకు ఈ జంట కొంతకాలం అద్భుతమైన సంబంధాన్ని కొనసాగించారు. ఈ జంటల వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియనప్పటికీ వారి వివాహం 2010 సంవత్సరంలో ముగిసింది. విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది.

రిషిరాజ్ ఝవేరితో విడాకులు తీసుకున్న కొద్దికాలానికే నేహా సాంఘికుడైన క్రుశాంత్ గోరగాంధీని వివాహం చేసుకుంది. ఆ తరువాత విదేశాలకు మకాం మార్చేసింది. అయితే ఈ దంపతులకు సెప్టెంబర్ 2018లో ఇవానా గోరగాంధీ అనే కుమార్తె కూడా ఉంది.

ఆమె తన నటనా వృత్తిని విడిచిపెట్టడానికి ముందు నాగిన్ – వాదోన్ కి అగ్నిపరిక్ష అనే సీరియల్లో నటించడం జరిగింది. ఆమె కెరీర్‌లో ఒక సమయంలో ఆమెను భారతీయ టెలివిజన్ అమాయక అందం అని ముద్దుగా కూడా పిలువబడింది. అయినప్పటికీ 2010లో క్రుశాంత్ గోరగాంధీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె లైమ్‌లైట్‌కు దూరంగా ఉండాలని ఎంచుకుంది. తన నటనా వృత్తిని విడిచిపెట్టడానికి ముందు, నేహా సినిమా నుండి భారతీయ టెలివిజన్‌కు వెళ్లిపోయింది.

అయితే తన కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోవడంతో, ఈ యువ నటి పరిశ్రమతో విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. నేహా పోషించిన చివరి టెలివిజన్ పాత్ర 2009లో నాగిన్ వాదోన్ కి అగ్నిపరీక్షలో టైటిల్ పాత్రలో నటించి మెప్పించింది.