మొదలైన దిల్ రాజు సీఎం మంతనాలు?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు దిల్ రాజు పేరు మరింత బలంగా మారిపోయింది. ఇటీవల ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్ లీడర్ గా గెలుపొందిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర నిర్మాతల సపోర్ట్ మొత్తం కూడా అందుకున్నారు. వీలైనంతవరకు అందరినీ ఏకం చేసే దిల్ రాజు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిలిం ఇండస్ట్రీ డెవెలప్ అయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో ఆయనకు రాజకీయంగా అయితే ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చాలావరకు తెలుగు చిత్ర పరిశ్రమకు కావాల్సిన అన్ని రకాల మద్దతులను అందిస్తోంది. టికెట్ల రేట్ల విషయంలో కూడా ఎప్పుడు తెలంగాణలో అయితే పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ ఆంధ్ర పాలిటిక్స్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కాస్త ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు తెలుగు నిర్మాతల మండలి లో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్న దిల్ రాజు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉండే కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించే విధంగా ఆయనతో చర్చలు జరిపే అవకాశం ఉందట.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ టికెట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇంతకుముందు మెగాస్టార్ తో పాటు ప్రభాస్ మహేష్ బాబు అలాగే మరి కొంతమంది సినీ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని టికెట్ల రేట్ల విషయంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వారి తరువాత దిల్ రాజు సీఎంతో వివిధ రకాల అంశాలపై మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇక త్వరలోనే సీఎం ఆఫీస్ నుంచి కబురు వచ్చే అవకాశం ఉంది. మరి దిల్ రాజు చర్చల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.