Prashanth Neel : పవన్ తో ప్రశాంత్ నీల్….. సినిమా వస్తే మాత్రం ఫాన్స్ కి పూనకాలే….!

Prashanth Neel : ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఫ్రాంచైస్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్. తన సినిమాలో హీరో ను చూపే విధానం, ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే నడిపే విధానం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 మరింత విజయాన్ని సాధించి పాన్ ఇండియా సినిమాగా రికార్డులు బద్ధలుకొడుతోంది.ఇక అటువంటి డైరెక్టర్ పవర్ స్టార్ తో సినిమా చేస్తే ఇంకా ఎన్ని రికార్డులు బద్ధలవుతాయో ఊహించడం కష్టం.

ఇక అలాంటి కాంబినేషన్ సెట్ అవబోతోంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ 2018 వ సంవత్సరం లో విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్న సమయం లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది.

ఈ సినిమా తర్వాత ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమా కూడా అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యి 100 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు సినిమా చేస్తున్నారు. ఇక. ఈ సినిమా జానపద సినిమా గా రూపొందుతోంది. మొదటి సారి పవన్ ఈ జోనర్ లో సినిమా చేయనుండడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.ఇక కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన హోంబలే సంస్థ త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యడానికి ఇటీవలే చర్చలు జరిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 2024 వ సంవత్సరం లో ఉంటుంది అట. ఈ సినిమాకి కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో బిజీ గా ఉన్నాడు దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనితర్వాత పవన్ తో సినిమా ఉండొచ్చని అంటున్నారు.