“ఖుషి” రీ రిలీజ్ డేట్ ఫిక్స్..దర్శకుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో భారీ హిట్స్ లలో యూత్ ఫుల్ బిగ్గెస్ట్ హిట్ అండ్ ఇండస్ట్రీ హిట్ “ఖుషి” కోసం తెలియని ఫ్యాన్స్ ఉండరు. మరి అలాంటి హిట్ సినిమాని మళ్ళీ పవన్ ఫ్యాన్స్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఆల్రెడీ ఈ ఏడాది జల్సా సినిమాతో భారీ రికార్డులు, వసూళ్లు సెట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషి రీ రిలీజ్ కి సిద్ధం అయ్యారు. మరి ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి డేట్ అధికారికంగా అయితే అనౌన్స్ అయ్యింది. ఈ చిత్రం ఈ డిసెంబర్ 31న ఘనంగా రిలీజ్ అవుతున్నట్టుగా ఇపుడు ఫిక్స్ అయ్యింది.

మరి ఈ రిలీజ్ సందర్భంగా అయితే దర్శకుడు ఎస్ జె సూర్య కూడా ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ఎన్నో ఏళ్ల పాటు నిలిచి ఉన్న బ్లాక్ బస్టర్, మళ్ళీ ఎవర్ గ్రీన్ రొమాన్స్ ని చూసేందుకు టీం వచ్చేసింది అని ఈ డిసెంబర్ 31 న చిత్రం రీ రిలీజ్ అవుతుంది మీ దగ్గర థియేటర్స్ లో తప్పకుండా చూడండి అంటూ ఎస్ జె సూర్య లేటెస్ట్ గా పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేసారు.

దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో అయితే పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు. ఇక ఇప్పుడు అయితే ఇదే నిర్మాతతో పవన్ హరిహర వీరమల్లు అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు.