క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్న ఛార్మి త‌ల్లిదండ్రులు.. ఆనందంగా ఉంద‌న్న పంజాబీ భామ‌

క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సామ్యాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా కరోనాతో బాధ‌ప‌డుతున్నారు. కొద్ది రోజుల క్రితం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌రోనా బారిన ప‌డి కోలుకుంది. రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, ఆయ‌న త‌ప్ప ఫ్యామిలీ అంతా కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్‌కు హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చికిత్స జ‌రుగుతుంది. ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నారని వైద్యులు హెల్త్ బులిటెన్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. ఇక‌ పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి త‌ల్లిదండ్రుల‌కు కూడా కొద్ది రోజుల క్రితం క‌రోనా పాజ‌టివ్‌గా నిర్ధారణ కావ‌డంతో ఆమె ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

ఇంట్లోనే ఉంటూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ త‌న తల్లిదండ్రుల‌కు కరోనా సోకింద‌ని ఛార్మి స్ప‌ష్టం చేసిది. అక్టోబర్ 22న వారికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు చెప్పిన ఛార్మి ప్ర‌స్తుతం వారు ప్రైవేట్ ఆసుప‌త్రిలో వైద్యం పొందుతున్న విష‌యాన్ని పేర్కొంది. ఎవ‌రికైన కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయోద్ద‌ని కూడా హితవు పల‌కింది. అయితే హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌న తల్లి దండ్రుల‌తో వీడియో కాల్ మాట్లాడిన ఛార్మి.. వారు క‌రోనాతో పోరాడే విధానాన్ని చూసి ఖుష్ అయింది. క‌రోనా మ‌హమ్మారిని జ‌యించేందుకు వారు చూపిస్తున్న పోరాట ప‌టిమ నాలో సంతోషాన్ని నింపింది అని ట్వీట్ ద్వారా పేర్కొంది.

ఒక‌ప్పుడు న‌టిగా రాణించిన ఛార్మి ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమా నిర్మాణాల్లో భాగం పంచుకుంటోంది . పూరీ క‌నెక్ట్స్‌కు సంబంధించిన నిర్మాణ ప‌నుల‌న్నీ ఛార్మీనే చూసుకుంటుంది. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఆమె నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.