నైజాంలో భారీ ధరకి “బ్రో” హక్కులు తీసుకున్న ప్రముఖ సంస్థ!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో తాను గెస్ట్ రోల్ లో నటించిన సినిమా మాత్రం “బ్రో”. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులు చేర్పులు చేశారు.

దీనితో తెలుగులో మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా పలు ఆసక్తికర వార్తలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ సమాచారం ప్రకారం అయితే బ్రో తాలూకా నైజాం హక్కులు భారీ ధరకి అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది.

కాగా ఈ సినిమా హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ కమ్ డిస్ట్రిబూస్టర్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారట. మరి ట్రేడ్ చెప్తున్నా మాట ప్రకారం ఐతే ఈ సినిమా హక్కులు 32 కోట్లు పెట్టి కొన్నారట. ఇది నిజంగా భారీ నెంబర్ అని చెప్పాలి. పవన్ కనిపించేది లిమిటెడ్ గానే అయినప్పటికీ పవన్ పేరు మీదే ఈ బిజినెస్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో బ్రో నైజాం ఒక్క ఆఫర్ నే ఈ రేట్ పలికాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరోగా నటిస్తుండగా హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ జూలై 28న రిలీజ్ కాబోతుంది.