ఒక్క చోట మాత్రమే వారంలో బ్రేకీవెన్ కొట్టిన “బ్రో”

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇంట్రెస్టింగ్ రీమేక్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓ నార్మల్ ఎంటర్టైనర్ గా రావడంతో సినిమాకి వచ్చిన ఆదరణ గాని వసూళ్లు గాని సరిపోలేదు.

దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం జరుపుకున్న బిజినెస్ ని నష్టాల్లోనే ముగియడానికి సిద్ధంగా ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ నే సుమారు 80 కోట్లకి పైగా జరగగా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 95 కోట్లకి పైగానే థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.

అయితే ఈ చిత్రం అన్ని చోట్ల నష్టాలు మిగిల్చినప్పటికీ కేవలం ఒకే ఒక్క దగ్గర మాత్రమే బ్రేకీవెన్ కొట్టినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇది ఎక్కడో కాదు కర్ణాటకలో అట. అక్కడ ఈ చిత్రం పెట్టుకున్న టార్గెట్ ని మొదటి వారం రోజుల రన్ తో కంప్లీట్ చేసి ఇక నుంచి లాభాలు అందుకుంటుంది.

కర్ణాటకలో బ్రో చిత్రానికి 4.7 కోట్ల బిజినెస్ జరగ్గా మొదటి వారానికి ఈ చిత్రం 4.8 కోట్ల షేర్ ని రాబట్టింది అట ఇక దీనితో ఈ చిత్రం అక్కడ మాత్రం లాభాలు అందుకుంది అని చెప్పాలి. మిగతా తెలుగు స్టేట్స్ లో మాత్రం నష్టాలు ఈ చిత్రానికి తప్పలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందించారు.