బ్రేకింగ్ : రవితేజ పాన్ ఇండియా నిర్మాతపై ఐటీ దాడులు 

టాలీవుడ్ సినిమా మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇప్పుడు నటించిన భారీ అవైటెడ్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాగా దసరా కానుకగా ఈ చిత్రం అవుతుండగా..

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాలు ఇవ్వడంలో సక్సెస్ అయ్యిన ప్రముఖ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు తెరకెక్కించారు. కాగా ఈ నిర్మాణ సంస్థ చైర్మన్ అయినటువంటి అభిషేక్ అగర్వాల్ పై ఆకస్మిక ఐటీ దాడులు జరగడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది.

కాగా మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు ఐతే ఈ మధ్య కాలంలో వీరి చిత్రాలు గాని వాటి నిర్మాణం గాని భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పైగా ఆల్ మోస్ట్ అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే అనౌన్స్ చేస్తుండడంతో గతంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ వసూళ్లు వాటి జి ఎస్ టి తాలూకా వివరాలు లాంటివి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చేసి ఉండొచ్చు అని కొందరు అంటున్నారు.

దీనితో ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మాత ఆఫీసుపై ఆకస్మికంగా ఐటి సహా జి ఎస్ టి శాఖ వారు కూడా కలయికలో సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సరిగ్గా సినిమా రిలీజ్ ముందు ఊహించనిదిగా మారింది. మరి నిర్మాత అయితే క్లీన్ గా బయటకి వస్తాడో లేదో అని చాలా మంది చూస్తున్నారు.