Akhanda:బాలయ్య బాబు తో జీవితాంతం తన జర్నీ ఇలానే…! అంటూ బోయపాటి ఎమోషనల్ స్పీచ్.

Akhanda:నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది.డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలో ప్రేక్షకులను థియేటర్ వద్దకు రప్పించి విజయం సాధించిన ఘనత బాలయ్య బాబు బోయపాటి కే చెందుతుంది. ఈ రోజుల్లో కూడా 100 రోజులు ఆడిన సినిమా గా చరిత్ర సృష్టించింది. అఖండ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బృందం అఖండ కృతజ్ఞత సభ ను కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు.

నందమూరి బాలకృష్ణ అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ సభలో డైరెక్టర్ బోయపాటి శీను చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానుల చేత కేకలు పెట్టించాయి. బాలకృష్ణ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఎమోషనల్ అయ్యారు.ఈసందర్భంగా అభిమానులే పెద్ద బలం అని, ఆ బలం ఎంత పెద్దదంటే అంటూ `చరిత్ర సృష్టించాలన్నా మీరే, దాన్ని తిరగరాయాలన్నా మీరే` అని తెలిపారు.

“అఖండ` సినిమాని బాలయ్య బాబు అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు ఆదరించారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఓక మాస్ సినిమాలో నేచర్ గురించి, భగవంతుడు గురించి చెప్పే స్కోప్ వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులోని సందేశం ఆడియెన్స్‌ కి బాగా నచ్చింది. రాయలసీమ ప్రజలు ఒక సినిమా చూసి నచ్చింది అని అంటే ప్రపంచం మొత్తానికి నచ్చుతుంది. `అఖండ` విషయంలో అదే జరిగింది. బాలయ్యబాబుతో నా జర్నీ జీవితాంతం ఇంతే సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటున్నాని తెలిపారు బోయపాటి. బాలయ్య బాబు కు అభిమానులు అంటే చాలా ఇష్టమని ఎందుకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా హుటాహుటిన సభకు విచ్చేసి కోసం సమయం కేటాయించారని చెప్పారు.