పాపం..ఇండియా, పాక్ మ్యాచ్ లో స్పెషల్ ఐఫోన్ పోగొట్టుకున్న బాస్ బ్యూటీ..!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ట్రెండ్ లో ఉన్న ఐటెం భామ ఎవరైనా ఉన్నారు అంటే అది బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్లాస్ట్ అండ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా అని చెప్పాలి. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కన్నా ముందు ఒకటి రెండు చిత్రాల్లో తెలుగులో చేసింది కానీ వీరయ్య సినిమా తర్వాత ఈమె ఫేట్ మారింది.

టాలీవుడ్ లో ఐటెం సాంగ్ అంటే ఇప్పుడు ఈమెనే ముందు ప్రిఫర్ చేస్తున్నారు. అలా మంచి డిమాండ్ ని తెచ్చుకున్న ఊర్వశి రీసెంట్ గా “బ్రో ది అవతార్”, “స్కంద” చిత్రాల్లో మెరిసింది. ఐతే ఇదంతా బాగానే ఉంది కానీ పాపం ఇప్పుడు ఊర్వశి ఓ పోస్ట్ పెట్టింది.

నిన్న ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ నరేంద్రమోడీ స్టేడియం లో జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ కి ఆమె కూడా వెళ్లినట్టుగా పలు పోస్ట్ లు పెట్టింది. కానీ ఈరోజు మధ్యాహ్నం అదే మ్యాచ్ కి వెళ్లి తన ఖరీదైన ఐఫోన్ ని పోగొట్టుకున్నట్టుగా పోస్ట్ వేసింది. సర్లే నార్మల్ ఐఫోన్ నే కదా వాళ్ళకి చిన్న విషయం అనుకోవచ్చు.

కానీ ఇక్కడ మేటర్ ఏమిటంటే ఆ ఐఫోన్ మొత్తం 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారంతో చేసిందట. అందుకే పాపం బాధపడుతూ నా ఫోన్ పోయింది ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా కొందరు కే=మాత్రం ఫోన్ పోలేదు ఏమి పోలేదు ఈమె జస్ట్ అటెన్షన్ కోసమే ఇలా చేస్తుంది అని అంటున్నారు.