బాలీవుడ్, టాలీవుడ్ కి పూజా హెగ్డే నే కావాలంటున్నారు ..!

బాలీవుడ్ .. టాలీవుడ్ .. ఎక్కడ చూసినా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో మేజర్స్ పూజా హెగ్డే ని నటింపజేయడానికి భారీగా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే టాలీవుడ్ లో ప్రభాస్ హీరో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ రాధే శ్యాం సినిమా కంప్లీట్ చేసింది. రాధకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా పూజా హెగ్డే కి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.

Prabhas's 'Radhe Shyam' first look goes viral

అలాగే అఖిల్ అక్కినేని తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా పూజా హెగ్డే పార్ట్ వరకు కంప్లీట్ అయిందని సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సక్సస్ మేజర్ గా పూజా హెగ్డే మీదే ఉందని ప్రేక్షకులే కాదు కొందరు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. అఖిల్ కి ఇప్పటి వరకు సక్సస్ అన్నది నమోదు కాలేదన్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి గత కొన్నేళ్ళుగా హిట్ అన్నది లేదు. దాంతో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ సినిమాకి క్రేజీగా మారింది ఒక్క పూజా హెగ్డే మాత్రమే.

Most Eligible Bachelor' new poster released

కాగా టాలీవుడ్ లో ఇంకా ఏ సినిమాకి సైన్ చేయని పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సినిమాలు కమిటయింది. రోహిత్ శెట్టి – రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అలాగే సల్మాన్ నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళి’ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. ఇటు టాలీవుడ్ లో ప్రభాస్ సహా పలు స్టార్ హీరోల సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. మొత్తానికి పూజా హెగ్డే డేట్స్ కోసం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఉన్న బడా మేకర్స్ అందరూ పోటీ పడుతుంటడం విశేషం.