పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం అనుష్కతో సంప్రదింపులు.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘ఓజీ’ సినిమా కోసం అనుష్కతో సంప్రదింపులు చేస్తున్నారట. అనుష్క అంటే, అనుష్క శెట్టి అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్లే. అనుష్క కాదండోయ్.. బాలీవుడ్ భామ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. అవునండీ, ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అయితే బావుంటుందని అనుకుంటున్నారట.

ఆ దిశగా ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారట. ఒకవేళ అనుష్క ఒప్పుకుంటే, ఇదే అనుష్కకు తెలుగులో తొలి సినిమా అవుతుంది. ఇప్పటికే అలియా భట్, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు తెరపై సందడి చేశారు. త్వరలోనే దీపికా పదుకొనె కూడా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది.

ఈ గాసిప్ నిజమైతే, ఆ లిస్టులోకి అనుష్క శర్మ కూడా చేరనుందన్న మాట. అయితే, ఈ రూమర్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే ఇంకాస్త టైమ్ వేచి చూడాల్సి వుంది. ‘సాహో’ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.