బాలీవుడ్ బజ్ : “పుష్ప 2” రిలీజ్ పై స్ట్రాంగ్ టాక్ 

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ ఉన్న చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి మరి ఈ చిత్రం రిలీజ్ విషయంలో అయితే ఎప్పటి నుంచో సస్పెన్స్ నడుస్తుండగా..

ఈ చిత్రం రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ ఇప్పుడు నుంచే ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ మాత్రం కాస్త స్లో గానే కొనసాగుతుంది కానీ ఇప్పటివరకు 40 శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా షూటింగ్ ఇలా నడుస్తుండగా నెక్స్ట్ ఈ చిత్రం రిలీజ్ పై మాత్రం గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ సహా బాలీవుడ్ సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ అయితే నడుస్తుంది.

దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాదిలో దాదాపు మార్చ్ రిలీజ్ కి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి మొదటి చిత్రంలా కాకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం హిందీ మార్కెట్ లో సినిమాని తీసుకెళ్లే ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఈసారి పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరింత మంది బిగ్ స్టార్స్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ ని తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తున్నారు.