బిగ్ బాస్ 4: మోనాల్ కన్నా నేను చాలా బెట‌ర్‌.. రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కుమార్ సాయి

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ 4 సీజన్‌లో కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌పై గందరగోళం నెలకున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌ విషయంలో తీవ్ర అవకతవకలు ఉన్నాయని వీక్షకుల ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తాము మద్దతుగా నిలిచిన కుమార్ సాయిని ఇంటి నుంచి పంపించడంతో ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. పురిహోర కలిపేవాళ్లని ఇంట్లో ఉంచి..బాగా ఆడేవాళ్లను బయటకు పంపిస్తున్నారని హెస్ట్ నాగార్జునతో బిగ్ బాస్ నిర్వాహకులను ఏకిపారేశారు. అతడితో రీ ఎంట్రీ ఇప్పించాలని కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు నడుస్తున్నాయి. వారి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న బిగ్ బాస్ కుమార్ సాయితో రీ ఎంట్రీ ఇప్పించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రీ ఎంట్రీ విషయంపై కుమార్ సాయి స్పందించారు.

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను సినిమా స్రిప్టులు, వెబ్ సిరీస్‌లు పట్టాలెక్కించడంపై ఫోకస్ పెట్టానని..వాటి గురించే పలువురితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. బిగ్‌బాస్‌లోకి మళ్లీ నన్ను రావాలను చాలామంది వీక్షకులు కోరుకొంటున్నారనే విషయం ఆనందాన్ని కలిగిస్తుందని కుమార్ సాయి వెల్లడించారు. మళ్లీ అవకాశం వస్తే దానిని వదులుకోను కానీ తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎటువంటి సందేశం రాలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ మళ్లీ ఎంట్రీ ఇస్తే… ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాను అని కుమార్ సాయి తెలిపారు.

“గతంలో నేను ఎలాంటి ప్లానింగ్స్ పెట్టుకోను. రియాలిటీతో అప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తాను. ఎప్పట్లానే నేను ఒంటరిగా ఆడతాను. మిత్రులను, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడికి వెళ్లడం లేదనే విషయం తెలుసు. నా ఎలిమినేషన్ విషయంలో అసంతృప్తి ఉంది. ఓట్ల విషయం పక్కన పెడితే.. మోనాల్ కంటే నేను మంచి ప్రదర్శన ఇచ్చానని నిజాయితీతో చెప్పగలను. కానీ ఆమె సేవ్‌ చేసి.. నన్ను బయటకు పంపారు. బిగ్‌బాస్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను” అని కుమార్ సాయి పేర్కొన్నారు. నాగ్ సార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎనీ టైమ్ స్క్రిప్ట్ టైమ్ వినిపించేందుకు రెడీ అని, ఆ అద్బుత క్షణాల కోసం ఎదురు చూస్తున్నట్లు కుమార్ సాయి వివరించారు. సో..కుమార్ సాయి బిగ్ బాస్ ఇంట్లోకి రీ ఎంట్రీపై ఇంకా స్పష్టత రానట్లే.