Gopichand: గోపీచంద్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 పూజా కార్యక్రమాలతో ప్రారంభం

ప్రతిష్టాత్మకమైన, అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో వరుసగా సక్సెస్‌లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ ఈ విజయవంతమైన నిర్మాణ సంస్థ మాచో స్టార్ గోపీచంద్‌తో సినిమా చేయబోతోంది. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.

ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరో సారి సంచలనాన్ని సృష్టిస్తుండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు – గోపీచంద్, మీనాక్షి దినేష్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC)
సమర్పణ – బాపినీడు
నిర్మాత – బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకుడు – కుమార్ సాయి
డిఓపి – శామ్‌దత్ ISC

పవన్ పని తీరు | Ex Home Minister Mysura Reddy About Pawan Kalyan Politics | Ys Jagan | Telugu Rajyam