బిగ్ అప్డేట్ : “యాత్ర 2” విడుదలపై హింట్ ఇచ్చేసిన డైరెక్టర్ 

ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సినిమాకి సంబంధించి అలాగే ఏదొక కనెక్షన్ ఉంటూనే ఉన్న సంగతి తెలిసిందే. కాగా గతం నుంచి కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు అయితే సినిమా నటుల కొందరి ప్రత్యేక కలయికలో అయితే పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

దీనితో ఇదే సినిమాలు అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకులూ కూడా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అలా గతంలో 2019 ఎన్నికల సమయంలోనే పలు సంచలన సినిమాలు రాగా ఈ సినిమాలలో స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో భాగమైన పాదయాత్రపై దర్శకుడు మహి వి రాఘవ చేసిన సినిమానే “యాత్ర”.

అయితే అదే సమయంలో వచ్చిన అన్ని చిత్రాల్లో ఇది కాస్త బెటర్ గా థియేటర్స్ లో ఆడింది. కాగా దీనికి అయితే ఈసారి కొనసాగింపుగా యాత్ర 2 ని వై ఎస్ కొడుకు వై ఎస్ జగన్ పై చేస్తుండగా ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని తాను ఎపుడో తనకి డబ్బులు రావాలి అంటే ఎన్నికల ముందే రిలీజ్ చేస్తానని తెలిపాడు.

ఇపుడు ఈ డేట్ అయితే వచ్చేసింది. కాగా దీనిపై దర్శకుడు పెట్టిన పోస్ట్ లో హింట్ తో అయితే డేట్ పై క్లారిటి వచ్చేసింది. తాను చేసిన మొదటి సినిమా 2019 లో ఫిబ్రవరి 8న విడుదల చేయగా మళ్ళీ ఎన్నికల సంవత్సరం 2024 సరిగ్గా ఫిబ్రవరి 8 అంటూ పోస్ట్ చేశారు. దీనితో యాత్ర 2 కూడా అదే డేట్ లో వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఈ చిత్రంలో వై ఎస్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు.