బిగ్ న్యూస్ : విషాద ఘటనపై ఫైనల్ గా ఎన్టీఆర్ స్పందన..డీటెయిల్స్ ఇవే.!

సాధారణంగా టాలీవుడ్ లో ఏవైనా పలు పెద్ద కుటుంబాల్లో కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నపుడు మాత్రం పలు సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో అలాగే ముఖ్యంగా రాజకీయాల్లో పలువురు వ్యక్తులు నుంచి కాస్త ఇబ్బందికర కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.

అలాగే రీసెంట్ గానే టాలీవుడ్ సహా ఏపీ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకున్న విషాద ఘటన నందమూరి ఉమా మహేశ్వరి బలవన్మరణం. అయితే ఈ ఘటన విషయంలో నందమూరి ఫ్యామిలీ దిగ్బ్రభ్రాంతి వ్యక్తం చేశారు కానీ అసలు ఈ ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఎందుకు స్పందిచలేదు అనే అంశం ఓ రకంగా ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడని అలాగే బాలయ్య వల్లే తాను అంత్య క్రియలకు కూడా వెళ్లలేదా? కనీసం ఒక్క పోస్ట్ కూడా తారక్ ఎందుకు పెట్టలేదు అని ఎన్టీఆర్ స్పందన కోసం చాలా మంది అనేక కామెంట్స్ చేశారు. మరి వాటికి అయితే తారక్ ఫైనల్ ఆ స్పందించనున్నట్టుగా ఇప్పుడు వార్తలు బయటకి వచ్చాయి.

ఎన్టీఆర్ ఈరోజు ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని కలవడానికి రెడీ అయ్యాడని ఈరోజు సాయంత్రం 3 గంటలు లేదా 4 గంటల సమయంలో వారిని కలిసి పరామర్శించనున్నాడని సినీ వర్గాల నుంచి ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే మరి ఈ సమయంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తాడా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది.