ఆ విషయంలో బాలయ్య తోపు…. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈమె నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అయితే వాల్తేరు వీరయ్య సినిమాలు చిరంజీవి హీరో కాగా, వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు.అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈమెకు డాన్స్ చేసే విషయంలో చిరంజీవితో చేయడం కష్టమా లేక బాలకృష్ణతో చేయడం కష్టమా అనే ప్రశ్న ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు ఈమె చెప్పిన సమాధానం విన్నటువంటి నేటిజన్స్ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ స్టార్ హీరోలు కావడం గమనార్హం. అయితే ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే అభిమానులను దృష్టిలో ఉంచుకున్నటువంటి శృతిహాసన్ ఇద్దరి హీరోల డాన్స్ విషయంలో చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.మాస్ స్టెప్పులు వేయడంలో బాలయ్య తోపు అంటూ సమాధానం చెప్పగా క్లాస్ మాస్ మిక్సీ కొట్టడంలో చిరంజీవి కేక అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇలా ఇద్దరి హీరోలకి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తూ ఈమె చెప్పిన సమాధానానికి అభిమానులు ఫీదా అవుతున్నారు. మరి ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఎలా సందడి చేస్తాయో తెలియాల్సి ఉంది.