ఓటిటి : ఫస్ట్ టైం బాలయ్య షోలో ఓ క్రేజీ ఎపిసోడ్..

టాలీవుడ్ సినిమా మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేసిన చిత్రాలతో అయితే తన కెరీర్ లో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి రాగా హ్యాట్రిక్ వరుస విజయాలు అనంతరం బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని అయితే లాక్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం దర్శకుడు బాబీతో నిన్ననే స్టార్ట్ కాగా.

బాలయ్య సినిమాలతో పాటుగా ఓటిటిలో కూడా హోస్ట్ గా చేస్తూ తన సూపర్ డూపర్ హిట్ షో అయితే నడుస్తున్న సంగతి తెలిసిందే. అదే “అన్ స్టాప్పబుల్”, ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకొని మూడో సీజన్లోకి కూడా వచ్చిన ఈ సిరీస్ లో ఇప్పుడు ఓ క్రేజీ ఎపిసోడ్ ని ఇప్పటివరకు ప్లాన్ చేయని ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా మొట్టమొదటి సారిగా అయితే బాలయ్య షో లోకి ఓ బాలీవుడ్ స్టార్ హీరో అడుగు పెట్టబోతున్నాడట. ఇంకా డీటెయిల్స్ చూస్తే బాలీవుడ్ సినిమా దగ్గర స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఇంటెన్స్ చిత్రం “ఆనిమల్” ప్రమోషన్స్ లో భాగంగా అయితే రణబీర్ కపూర్ సహా దర్శకుడు సందీప్ వంగ మరియు హీరోయిన్ రష్మికా మందన్నా కూడా బాలయ్య షో లో సందడి చేయనున్నారని తెలుస్తుంది.

అయితే ఇది మాత్రం ఓ క్రేజీ ఎపిసోడ్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. బాలయ్య అల్లరికి బాలీవుడ్ హీరో రష్మికా మందన్నా సందీప్ ల నడుమ అయితే ఈ ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనిపిస్తుంది. ఇంకా దీనిపై మరింత క్లారిటి రావాల్సి ఉంది.