‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం తెలిసిందే.

Power star 'Ake' remake shooting starts ..!

షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని వెల్లడిస్తూ తుపాన్ మొదలైంది అంటూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో షూటింగ్ కోసం జరుగుతున్న సన్నాహాలను చూపిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టడం చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పవన్ బైక్ పై ఓ లాడ్జిలోకి ఎంటర్ అయ్యే సీన్స్ ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

మలయాళ రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో తగినన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్లు సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి బిల్లా రంగ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.