ఇన్సైడ్ టాక్ : ఏపీలో “గుంటూరు కారం”కి మరో స్పెషల్ పర్మిషన్??

రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇప్పుడు భారీ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ మాస్ చిత్రం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ హైక్ లు ఇచ్చాయి. కాగా ఏపీలో అయితే ఏకంగా 50 రూపాయల హైక్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఆశ్చర్యంగా మారింది. ఇక ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది.

ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా వరకు సినిమాల ఎర్లీ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఆపేసారు. అలానే గుంటూరు కారంకి కూడా బెనిఫిట్ షోస్ లాంటివి లేకుండానే వస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో పలు చోట్ల మిడ్ నైట్ షోస్ పడనున్నాయి అని వినిపిస్తుంది.

కాగా దీనితో ఈ చిత్రానికి మరో స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. మరి మహేష్ సినిమాకే ఇంతలా ఏపీ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుందో అనేది చాలా మందిలో ప్రశ్నగా మారింది. కాగా ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి ముఖ్య పాత్ర చేసింది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.