షాక్ మీద షాక్..మరో షాకింగ్ కాంట్రవర్సీలో పూరి.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ దర్శకుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒకరు. మరి పూరి అయితే తన కెరీర్ లో భారీగా వరుస ప్లాప్ సినిమాలు తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఈ చిత్రం తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో “లైగర్” అనే సినిమా అనౌన్స్ చేసి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారాడు.

కానీ సినిమా మాత్రం షాకింగ్ గా టాలీవుడ్ లోనే ఘోరమైన నష్టాలు మిగిల్చిన సినిమాగా నిలిచిపోయింది. దీనితో అక్కడ నుంచి పూరి కి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అనేక వేధింపులు రాగా పూరి అయితే ఓ సంచలన ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఎవరికీ తగ్గేది లేదని చెప్పేసాడు.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఈ సినిమా విషయంలోనే మరో షాకింగ్ కాంట్రవర్సీ లో పూరి ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి బడ్జెట్ పెట్టడం విషయంలో పలువురు రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఈడీ డిపార్ట్మెంట్ వారికి తెలియడంతో పూరీని అదుపులోకి తీసుకొని విచారణ జరపడం ఆసక్తిగా మారింది.

దీనితో మళ్ళీ పూరీ కి గడ్డు కాలం తప్పలేదని టాలీవుడ్ శ్రేణులు అభిప్రాయం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తనతో పాటుగా నిర్మాత ఛార్మిని కూడా ఈడీ వారు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే లైగర్ వివాదాలతో పూరి పీకల్లోతులో పడిపోయాడు.