ఫవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజు కాంబినేషన్‌లో మరో సినిమా.!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ఆల్రెడీ తమిళ రీమేక్ ‘వినోదయ సితం’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

కాగా, ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా ఓకే అయ్యిందనీ ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అయితే, ఈ సారి పవన్ కళ్యాణ్ తెరపై కనిపించడట. కానీ, పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్ క్రియేటివ్ బ్యానర్స్‌లో తేజు ఓ సినిమా చేయబోతున్నాడట.

పవన్‌కి అత్యంత సన్నిహితుడైన మరో నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనున్నాడనీ సమాచారం. అలాగే, డైరెక్టర్ కూడా ఆల్రెడీ పవన్‌తో వర్క్ చేసినోడే అని తెలుస్తోంది.

ఇటీవలే పవన్‌తో సినిమా తీసి హిట్ కొట్టిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. గతంలోనే చూజాయగా ఓకే అయిన ఈ ప్రాజెక్ట్.. తాజాగా కన్‌ఫామ్ అయ్యిందనీ సమాచారం.

లేటెస్ట్‌గా ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్‌లో వున్నాడు తేజు. ఇదే జోరులో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్టులు ఓకే చేసేసినట్లు తెలుస్తోంది. అందులోనిదే ఈ ప్రాజెక్ట్ ఒకటి.