అన్నదమ్ములిద్దరూ వెండితెరపై.!

సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ కలిసి ఒకే తెరపై కనిపిస్తే ఎలా వుంటుంది.? మస్త్ మజా వస్తుంది కదా. అన్నదమ్ములిద్దర్నీ ఒకే తెరపై చూస్తే ఫ్యాన్స్‌కి ఆ పండగ వేరే లెవల్.

చూస్తుంటే, ఆ మంచి తరుణం త్వరలోనే రాబోతున్నట్లు కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్‌తో గతంలో ఓ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ ఒకరు, ఈ కాంబోని సెట్ చేసేలా కనిపిస్తున్నాడు.

ఆల్రెడీ ఈ కాంబో కోసం కథ కూడా సిధ్ధం చేశాడట. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా రెడీగా వున్నారట. అయితే, చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం కోసం వెయిటింగ్‌లో వున్నారట. పవన్ రాజకీయ పనుల్లో బిజీగా వుండడం వల్ల కాస్త డిలే అవుతోందట.

పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే, ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రానుందనీ సమాచారం. అన్నట్లు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సమర్పణలో రూపొందించబోతున్నట్టుగా తెలుస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ దిస్ క్రేజీ ప్రాజెక్ట్.