అవి మన కోసం కాదు.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్

Anchor Rashmi about Cow and milk

యాంకర్ రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయింది. ఒకప్పుడు రష్మీపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆమె ధరించే దుస్తులపై ఎక్కువగా ట్రోల్స్ వచ్చేవి. అయితే ఆమె గురించి, ఆమె మనస్తత్వం గురించి తెలిసిన తరువాత రష్మీపై ట్రోలింగ్ తగ్గింది. తెరపై కంటే.. తెర వెనుక రష్మీకి అభిమానుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. మూగ జీవాల కోసం రష్మీ పాటు పడే మంచి తనాన్ని చూసి అందరూ ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు.

Anchor Rashmi about Cow and milk
Anchor Rashmi about Cow and milk

లాక్డౌన్ సమయంలో రష్మీ మూగ జీవాల కోసం ఎంతో శ్రమించింది. ఆకలితో అలమటిస్తోన్న ఎన్నో ప్రాణులకు రష్మీ ఆహారాన్ని అందించింది. అలా రష్మీ చేసిన ఎన్నో మంచి పనులు ఆమెను ఇంకా ఎంతో మందికి దగ్గర చేశాయి. అయితే ఆమె అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు, పోస్ట్‌లు కొన్ని మతాలను వ్యతిరేకించేలా ఉంటాయి. అలాంటి సమయంలో రష్మీ ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంది. ఆయితే ఆమె అన్ని మూగ జీవాల కోసం పాటు పడుతుందనే విషయం కొంత మందికే తెలుసు.

తాజాగా రష్మీ ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఆవు పాలను ఎక్కువగా ఇచ్చేందుకు వాడుతున్న ట్రిక్ మీద మండిపడింది. చనిపోయిన ఆవు పిల్లను అలా కట్టేసి దాని పక్కన పెట్టడం.. దాన్ని చూపిస్తూ ఆవు నుంచి ఎక్కువ పాలను పిండటంపై రష్మీ ఫైర్ అయింది. అయినా ఆవు పాలు ఉన్నవి దాని పిల్లల కోసం.. మన కోసం కాదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా ఇలాంటివి మానేయండని కోరింది. మొత్తానికి రష్మీ చేసే మంచి పనులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.