వాహ్..రష్మికి 4.9 మిలియన్‌ ఫాలోవర్లు!

వారం వారం టీవీ ఛానల్‌లో ‘జబర్దస్త్‌’ షోతో ఎందరినో అభిమానులను సంపాదిస్తున్న రష్మి గౌతమ్‌ సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుకుగా ఉంటుంది. ఒక పక్క యాంకరింగ్‌ చేస్తూనే, మరో పక్క సినిమాల్లోనూ నటిస్తూ ఉంటుంది రష్మి. తన సామాజిక మాధ్యమంలో ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను పెడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది.

ఆమెకి(Rashmi Gautam) స్టయిల్ గా ఎలా ఉండాలో బాగా తెలుసనీ, అలాగే ఎటువంటి అవుట్‌ ఫిట్స్‌ వేసుకుంటే ఆమె బాగుంటుందో ఆమె అభిమానులు ఆమె ఫోటోలపై వ్యాఖ్యానాలు కూడా పెడుతూ వుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో రష్మికి 4.9 మిలియన్‌ ఫాలోవర్లు వున్నారంటే ఆమె ఎంత పాపులర్‌ సెలబ్రెటీనో అర్థం చేసుకోవచ్చు. తన సామాజిక మాధ్యమం ద్వారా పెంపుడు జంతువులకు సపోర్టివ్‌ గా ఎక్కువగా మాట్లాడుతూ వాటిగురించి ఎంతో తపన పడుతూ ఉంటుంది రష్మి.

అలాగే సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా వెంటనే వాళ్ళకి తగు రీతిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, సమస్యలపై కూడా సామాజిక మాధ్యమంలో తనదైన రీతిలో గళం విప్పుతుంది.. రష్మి గౌతమ్‌ ఇప్పుడు కాదు సుమారు రెండు దశాబ్దాల క్రితమే సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. ఉదయ్‌ కిరణ్‌ కథానాయకుడిగా నటించిన ’హోలీ’ (2002) అనే సినిమా ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత వరసగా చాలా సినిమాలు చేసినా 2015లో వచ్చిన ‘గుంటూరు టాకీస్‌’ రష్మికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమాలోనే కాకుండా టీవీ లో కూడా చాలా షోస్‌ కి యాంకరింగ్‌ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది రష్మీ. ఇప్పుడు ‘జబర్దస్త్‌’ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది, అలాగే ’ఢీ’ అనే షో కి కూడా వ్యాఖ్యాతగా చేస్తూ ఎంతోమంది అభిమానుల ప్రేమలను గెలుచుకుంటోంది రష్మి.