ఆ విషయాలన్నీ జ్ఞాపకాలే.. సితార ఎమోషనల్ పోస్ట్?

సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో తన కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది అభిమానులు ఇతర సిన్ని సెలెబ్రిటీలో కృష్ణ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూతురు కృష్ణగారి మనవరాలు సితారకు సైతం కృష్ణ గారితో ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది ఈ క్రమంలోనే వారాంతం వస్తే చాలు కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా తన ఉన్నచోటకు వెళ్లి అక్కడే భోజనం చేసి ఆయనతో కలిసి సరదాగా గడిపేవారు.

ఇక మహేష్ బాబు కుటుంబ సభ్యులు సైతం వీకెండ్ ఆయన దగ్గరకు వెళ్లి విలువైన సమయాన్ని గడిపేవారు. ఈ విధంగా కృష్ణ గారితో సితారకు మహేష్ బాబుకి ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.ఈ క్రమంలోనే కృష్ణ గారు మరణించడంతో సితార తన తాతయ్య మరణాన్ని గుర్తుచేసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సితార సోషల్ మీడియా వేదికగా తన తాతయ్యతో తనకు అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇకపై వీకెండ్ మునపటిలా ఎప్పటికీ ఉండవు తాతయ్య.. మీరు మాపై ఎంతో ప్రేమను చూపించడమే కాకుండా ఎన్నో విలువైన విషయాలను మాకు తెలియజేశారు. ఈ విషయాలన్నీ మాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఎప్పటికైనా మీరే నా హీరో..మీరంతా గర్వపడేలా చేస్తాను ఐ మిస్ యు తాతగారు అంటూ సితార సోషల్ మీడియా వేదికగా తన తాతయ్యతో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.