Yash: క్రెడిట్ అంతా ఆయనకే చెందాలి: కన్నడ హీరో యష్

Yash: కన్నడ సూపర్ స్టార్ యష్ , డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని భారీ స్థాయిలో ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే ఈ సినిమా అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌నే కాదు హీరో యష్‌కూ పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చేలా చేసింది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించగా, ఈ మూవీ విడుదల సమయంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో కేజీఎఫ్ 2 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అప్పటినుంచీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ విషయంలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చారు. కేజీఎఫ్ 2 నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‎కు ఇప్పటికే ఏ రేంజ్‏లో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కాగా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారనటంలో ఏమాత్కం సందేహం లేదు.

అయితే తాజాగా బెంగళూరులో జరిగిన కేజీఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర బృంద పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే హీరో యష్ కూడా తన మనసులోని భావాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా వెనక ఎనిమిదేళ్ల కష్టం ఉందన్న ఆయన, లైట్ మ్యాన్ దగ్గర్నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ వారి చెమట, రక్తాన్ని చిందించి ఈ సినిమాను పూర్తి చేశారని ఆయన కొనియాడారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చేసినందుకు గాను తనను పొగుడుతున్నారన్న యష్, అది సరి కాదని, ఆ క్రెడిట్ కేవలం ప్రశాంత్ నీల్‌కే చెందాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా తాజాగా కేజీఎఫ్ 2 ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి అశేష స్పందన వస్తోంది. మరోసారి యష్ నటనతో అదరగొట్టాడని, ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.. రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకోంటున్నాయి.. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.