పవన్ కళ్యాణ్ తో అలీ కలుస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇమ్రాన్ హస్మీ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి యాక్టర్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తనకి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వారాహి యాత్ర ఫస్ట్ రౌండ్ పూర్తయిన వెంటనే జులై సెకండ్ వీక్ నుంచి ఓజీ షూటింగ్ లో పవన్ పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఓజీ సినిమాలో కమెడియన్ అలీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారంట.

పవన్ కళ్యాణ్, అలీ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి మంచి ఆసక్తి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత 2019 ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. జనసేన పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అలీ గురించి కొన్ని విమర్శలు చేశారు. వాటిపై అలీ కూడా రియాక్ట్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు.

అప్పటి నుంచి పవన్ కళ్యాణ్, అలీకి మధ్య గ్యాప్ పెరిగింది. పవర్ స్టార్ అభిమానులు కూడా అలీని ద్వేషిస్తూ ఉంటారు. ఆ తరువాత పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలలో ఛాన్స్ ఉన్న కూడా అలీని తీసుకోలేదు. అలాగే బ్రో మూవీలో కూడా నటించలేదు. అయితే సుజిత్ వారి మధ్య ఉన్న గ్యాప్ కి బ్రేక్ వేసి ఓజీ మూవీ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ తన సినిమాలలో అలీని తీసుకోవద్దని ఎవ్వరికి చెప్పలేదు. అయితే వారి మధ్య గ్యాప్ ఉండటంతో దర్శకులు, నిర్మాతలు మళ్ళీ అలీని ఎంపిక చేసే సాహసం చేయలేదు. అయితే సుజిత్ మాత్రం ఫ్యాన్ గా అలీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ని మళ్ళీ చూడాలనుకొని ఓజీ సినిమాలో వారిద్దరికి సంబందించిన సీక్వెన్స్ పెట్టారంట. నెక్స్ట్ షెడ్యూల్ లో అలీ కూడా పాల్గొనే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.