‘మిషన్‌ రాణిగంజ్‌’గా అక్షయ్‌ సినిమా!

‘ఓ మై గాడ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో చాలా రోజులకు హిట్‌ కొట్టాడు స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ . ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ’ బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తుంది. 1989లో రాణిగంజ్‌ అనే మైనింగ్‌ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఈ ప్రమాదంలో జస్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే మైనింగ్‌ ఇంజనీర్‌ మైనింగ్‌లో చిక్కుకున్న 64 మందిని కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక కేసరి వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తరువాత అక్షయ్‌, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వశ్‌ భగ్నానీ నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తికాగా.. ఈ మూవీ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను మారుస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ అనే మూవీ టైటిల్‌ను ‘మిషన్‌ రాణిగంజ్‌‘ గా పేరు మార్చినట్లు మేకర్స్‌ ప్రకటించారు.

టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ బర్త్‌ డే పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. చిత్రంలో అక్షయ్‌, పరిణీతితో పాటు, రాజేష్‌ శర్మ, రవి కిషన్‌, గౌరవ్‌ ప్రతీక్‌, అనంత్‌ మహదేవన్‌ దిబ్యేందు భట్టాచార్య కీలక పత్రాలు పోషిస్తున్నారు.