న్యూయార్క్‌ పంద్రాగస్ట్‌ వేడకులకు సమంత!

ఏడాది పాటు సినిమాలకు సెలవులు పెట్టి హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తుంది సమంత. ఓ వైపు మయోసైటిస్‌ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ అరుదైన గౌరవం దక్కింది.

న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతుందట. వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనే గొప్ప ఆహ్వానం సమంతకు దక్కింది. సమంతతో పాటు నటుడు రవికిషన్‌, నటి జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందిందట.

గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్‌ బచ్చన్‌ రానా, అల్లు అర్జున్‌, అర్జున్‌ రాంపాల్‌, సన్నీ డియోల్‌, రవీనా టాండన్‌, తమన్నాలు హాజరయ్యారు. ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఖుషీ’ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ క్రియేట్‌ చేశాయి.

సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌ లెవల్లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. దీనితో పాటుగా వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ స్టీమ్రింగ్‌కు రెడీ అవుతుంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో సామ్‌ కాప్‌గా కనిపించనుంది.